మనవాళ్ళు ఇళ్ళ ముందు ముగ్గులు ఎందుకు వేస్తారు అనే దాని గురించి కొన్ని నెలల క్రితం టీ.వి చానల్లో (బహుశా డిస్కవరీ అనుకుంటా) ఒక కార్యక్రంఅం చూశాను . పాత కాలంలో ముగ్గు బియ్యపు పిండి వెసేవారట. (కానీ ఇప్పుడు సున్నంతో వేస్తున్నారనుకోండి). పొద్దున వేసిన ముగ్గు సాయంత్రాని కల్లా పురుగులు, చీమలు తినేస్తాయిట. అలా జరగని పక్షంలో ఏదో ప్రకృతి వైపరీత్యం సంభవించబోతున్నదని సంకేతమట. ఆ విధంగా మన వాళ్ళు జంతువుల యొక్క శక్తిని ఉపయోగించుకునేవారట.
మరి జంతువులు ముందే పసి గట్టగలవా? అది ఎంత వరకు నిజం. December 26th 2004 న వచ్చిన సునామీ వల్ల , భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరిగినా , జంతు నష్టం మటుకు తక్కువట. కొన్ని ఏనుగులు ముందే పసిగట్టి కొండలమీదకెళ్ళి ప్రాణం రక్షించుకున్నాయిట. కాబట్టి కొంతవరకు పైన చెప్పిన విషయం నమ్మబుద్దిగానే అనిపించింది.
References:
http://findarticles.com/p/articles/mi_qn4188/is_20050111/ai_n11503538
http://www.sea-user.org/news-detail.php?news_id=1289
http://news.bbc.co.uk/1/hi/sci/tech/4381395.stm
(search elephant in the above)
భాస్కర్ said
బ్రదరూ!!
అలా పురుగులకీ చీమలకి పిలిచి బువ్వ పెట్టే పని ఐతే ఒక బియ్యపు పిండి కుప్పలానో లేక ముద్దలానో పెట్టొచుకదా, నడుములు విరిగేల వంగుని మరీ ముగ్గు వెయ్యాల్సిన అవసరం ఉందా?